కాబూల్: ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఓ విద్యాలయం సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 10మంది మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మృతుల్లో పాఠశాల చిన్నారులు కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm