హైదరాబాద్ : సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులు చేసింది. సన్రైజర్స్ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. నికోలస్ పూరన్(32 నాటౌట్: 28 బంతుల్లో 2ఫోర్లు), కేఎల్ రాహుల్(27), క్రిస్ గేల్(20) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. ఆఖర్లో పూరన్ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయడంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ(2/29), జేసన్ హోల్డర్(2/27), రషీద్ ఖాన్(2/14) తలో రెండు వికెట్లు పడగొట్టి పంజాబ్ను దెబ్బకొట్టారు. మన్దీప్ సింగ్(17), గ్లెన్ మాక్స్వెల్(12), దీపక్ హుడా(0) చేతులెత్తేశారు. డెత్ ఓవర్లలో ప్రమాదకర పూరన్ను హైదరాబాద్ అద్భుతంగా కట్టడి చేసింది. అతడు స్వేచ్ఛగా షాట్లు ఆడకుండా పదునైన బంతులతో బెంబేలెత్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm