విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవలి కాలంలో పలు గ్రామాల్లో పర్యటించడంతో పాటు, తిరుమలకు వెళ్లివచ్చిన వంశీ కొన్ని రోజులుగా జ్వరం, జలుబు ఉంటోంది. అస్వస్థతకు గురైన ఆయన, టెస్ట్ లు చేయించుకోగా, ఆ ఫలితం నిన్న వెల్లడైంది. కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆయన 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు, ఇటీవలి కాలంలో ఆయన్ను కలిసిన వారంతా క్వారంటైన్ కావాలని, ఎవరికైనా కరోనా లక్షణాలుంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm