కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని హత్య చేశారు. మృతుడిని ములుగు జిల్లా మల్లంపేట గ్రామానికి చెందిన కోటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. కోటేశ్వరరావు హత్యకు గురైన తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm