దుబాయ్: వరుస పరాజయాతతో సతమతం అవుతున్న ధోనీసేనకు కాస్త ఊరట లభించింది. ఆ జట్టును ఎట్టకేలకు ఓ విజయం వరించింది. బెంగళూరును 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ జట్టు నిర్దేశించిన 146 పరుగుల మోస్తారు లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (65; 51 బంతుల్లో 4×4, 3×6) అజేయ అర్ధశతకంతో చెలరేగాడు. అతడికి తోడుగా అంబటి రాయుడు (39; 27 బంతుల్లో 3×4, 2×6), డుప్లెసిస్ (25; 13 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. బెంగళూరు బౌలర్లు మందకొడి పిచ్పై వేగంగా బంతులేసి మూల్యం చెల్లించారు.
Mon Jan 19, 2015 06:51 pm