హైదరాబాద్: బంజారాహిల్స్ లోటస్పాండ్లో ఓ యువకుడు అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని లోటస్ పాండ్ చెరువులో సుమారు 30 ఏళ్ల యువకుడి మృతదేహం బోర్లాపడి తేలియాడుతూ కనిపించింది. ఉదయం లోటస్పాండ్ పార్కు తెరిచిన వాచ్మెన్.. లోపలి ప్రాంతాన్ని పరిశీలించి బయటకు వచ్చేసరికి చెరువులో మృతదేహం కనిపించింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొందరు దీన్ని గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని బంజారాహిల్స్లోని ఐఏఎస్ కాలనీకి చెందిన మహమ్మద్ అహ్మద్ ఉద్దీన్ అలియాస్ అల్తాఫ్గా పోలీసులు గుర్తించారు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు.. లోటస్పాండ్లో విగతజీవిగా పడి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్తాఫ్కు షుగర్ వ్యాధి తప్ప ఎలాంటి ఇతర సమస్యలు లేవని అతడి సోదరుడు తెలిపాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm