ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో దుగ్గిరాల జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున దాదాపు 2 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. టాటా మ్యాజిక్ వాహనాన్ని పాల వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఎనిమిది మంది ప్రయాణికులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm