హైదరాబాద్ : ఇటీవల కాలంలో సింగరేణి గనుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వున్న సమాచారం మేరకు.. రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్పల్లి భూగర్భ బొగ్గు గనిలో జంక్షన్ కూలిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం 66 లెవెల్లో 41 డీప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న సింగరేణి యాజమాన్యం సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. అయితే స్థానిక అధికారుల ద్వారా ప్రమాదం నుంచి ముగ్గురు కార్మికులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి రెండు మూడు నెలలకు ఓ సారి ఇలా సింగరేణిలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సింగరేణి యాజమాన్యం తరఫు నుంచి అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించినా కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండడం పలు కుటుంబాల్లో విషాదాలు నింపుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm