హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. దుబ్బాక మండలం అప్పన్ పల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావును స్థానికులు అడ్డుకున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయడంలో వివక్ష చూపారని ఆరోపించారు. గజ్వేల్, సిద్దిపేట భూనిర్వాసితులకు లక్షల రూపాయలు అందించిన హరీశ్ రావు తమకు మాత్రం కేవలం వేల రూపాయలు చెల్లించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ గ్రామానికి రావడంతో స్థానికులు హరీశ్ రావును నిలదీశారు. అదే సమయంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. దీంతో మంత్రి హరీశ్ రావు అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm