హాయిగా, దర్జాగా హైదరాబాద్ నుంచి ఏపీలో ఓ పెళ్లికి హెలికాప్టర్ వేసుకుని వెళితే ఎలా ఉంటుంది. అబ్బో చాలా బాగుంటుంది. ఆ దర్జా, అ ఠీవీ చూసి జనం నోరెళ్లబెడతారు. ఊరి జనం మొత్తం ఆ హెలికాప్టర్ గురించి చర్చించుకుంటారు. అలాగే, ఓ పెళ్లికి హెలికాప్టర్లో వెళ్లిన వారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది.
హైదరాబాద్కు చెందిన మాజీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి, తెలుగు రాష్ట్రాల్లో ఓ సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్న డాక్టర్ వీఆర్కే రావు, అతడి కుటుంబసభ్యులు కలసి నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం రేవూరు గ్రామంలో ఓ పెళ్లికి వెళ్లారు. ఈ నెల 27న వారు హైదరాబాద్ నుంచి వెళ్లారు. రేవూరు గ్రామానికి చెందిన ఓ ఎన్ఆర్ఐ జనార్దన్ రెడ్డి ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరయ్యారు. కానీ, వారు వెళ్లిన హెలికాప్టర్ రేవూరిలోని ఓ హైస్కూల్ గ్రౌండ్లో దిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఆ స్కూల్ నిర్మాణం కోసం జనార్దన్ రెడ్డి పూర్వీకులు భూమి ఇచ్చారు. ఈ కారణంతో హైస్కూల్ హెడ్ మాస్టర్ కూడా హెలికాప్టర్ దిగడానికి అనుమతి ఇచ్చారు. కానీ, అదే ఆయనకు సమస్యగా మారింది. హెడ్ మాస్టర్ శ్రీనివాసులు మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.వాస్తవానికి ఏదైనా హెలికాప్టర్ దిగాలంటే ముందుగా ప్రోటోకాల్ ప్రకారం స్థానిక పోలీసులు, రెవిన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి నిబంధనలు ఉంటాయని హెలికాప్టర్ పైలెట్కు తెలుసు. కానీ, అలాంటి అనుమతులు ఏవీ తీసుకోలేదు. తీసుకోకుండానే హెలికాప్టర్ను స్కూల్ గ్రౌండ్లో దింపారు. దీంతో హెలికాప్టర్లో ఉన్న మొత్తం ఆరుగురి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే, స్కూల్ హెడ్ మాస్టర్ మీద కూడా కేసు నమోదు చేశారు. స్కూల్ నిర్మాణం కోసం స్థలం ఇచ్చిన వారే కదా అనే కృతజ్ఞతాభావంతో హెలికాప్టర్ దిగడానికి అనుమతి ఇచ్చిన హెలికాప్టర్ మీద ప్రస్తుతం క్రిమినల్ కేసు నమోదైంది.
అనంతసాగరం పోలీస్ స్టేషన్లో వారిపై కేసు రికార్డు అయింది. అయితే, ఈనెల 27న వారిని దించి వెళ్లి హెలికాప్టర్ కడప వెళ్లింది. అది కర్ణాటకకు చెందిన ఓ షుగర్ ఫ్యాక్టరీ అధినేతదిగా తెలుస్తోంది. మళ్లీ 30న వారిని పికప్ చేసుకోవడానికి రావాల్సి ఉంది. హెలికాప్టర్ ఓనర్ మీద కూడా కేసు నమోదు చేశారు. నిబంధనలను అతిక్రమించినందుకు కేసు నమోదు చేయడమే కాదు. వారిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు లేఖ రాయనున్నట్టు పోలీసులు తెలిపారు. మొత్తానికి వారు వచ్చిన హెలికాప్టర్ గురించి ఊరి ప్రజలు చర్చించుకుంటున్నారో, లేదో తెలీదో కానీ, వారిపై కేసు నమోదైన విషయం మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని పేపర్లు, సోషల్ మీడియాలో మాత్రం చర్చనీయాంశంగా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 29,2020 08:33PM