బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని ఓ హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని రిచ్మండ్ రోడ్డు వద్ద ఉన్న ఓ హోటల్లో వంట చేస్తుండగా స్టీమర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, గాయాలపాలైన ముగ్గురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హోటల్లో వంట స్టీమర్ పేలి అసిస్టెంట్ కుక్ ప్రాణాలు కోల్పోవడంతోపాటు అతని ముగ్గురు సహచరులకు కూడా ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక మరియు అత్యవసర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. హోటల్లో జరిగిన ప్రమాదాన్ని గమనించిన 60 మంది కస్టమర్లు బయటకు వెళ్లి గాయపడకుండా తప్పించుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm