హైదరాబాద్ : అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ నిమిత్తం మనాలీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరోయిన్ సమంతా బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్కు హోస్టుగా వ్యవహరించి అందరినీ అలరించింది. ఆ ఎపిసోడ్లో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, పాయల్ రాజ్పుత్, కమెడియన్ హైపర్ ఆది లాంటి సెలబ్రిటీలు ఆమెకు తమ వంతు సపోర్ట్ను అందించారు. దీనితో బిగ్ బాస్ దసరా ఎపిసోడ్ బ్లాక్బస్టర్ హిట్ సాధించింది. అయితే ఈ వారం కూడా సమంతా హోస్టుగా వస్తుందా.? లేక కింగ్ కనిపిస్తాడా.? అని సందిగ్దత నెలకొంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ వారం నాగార్జునే షోకు హోస్టుగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. కేవలం దసరా ఎపిసోడ్కు మాత్రమే సమంతాను బిగ్ బాస్ నిర్వాహకులు హోస్టుగా తీసుకున్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm