హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల వేళ ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ప్రచారంలో నేతలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. ప్రచారంలో భాగంగా వీరిద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు సుమోటాగా కేసులు నమోదు చేశారు. ఐపీసీ 505 సెక్షన్ కింద ఎస్ఆర్ నగర్ పోలీసులు వీరిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బండి సంజయ్, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో సామాజికంగా ఘర్షణలు చెలరేగే అవకాశాలున్నాయని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. పాత బస్తీలో అక్రమంగా రోహింగ్యాలు నివసిస్తున్నారని, వారిపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. హుస్సేన్ సాగర్ను ఆక్రమించి కట్టిన ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చగలరా? అంటూ సవాల్ విసిరారు. దీనికి బండి సంజయ్ స్పందిస్తూ.. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూలిస్తే.. రెండు గంటల్లోగా దారుసలాంను కూల్చేస్తామని ఛాలెంజ్ విసిరారు. వీరిద్దరి వ్యాఖ్యలతో సామాజికంగా ఘర్షణలు చెలరేగే అవకాశాలున్నాయని, అందుకే కేసులు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 28,2020 09:29AM