హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కరోనా బారినపడి ప్రలువురు రాజకీయ నేతలు మృతి చెందారు. తాజాగా కరోనా బారిన పడి ఎన్సీపీ ఎమ్మెల్యే భరత్ భాల్కీ శనివారం మృతి చెందారు. పరీక్షల్లో ఎన్సీపీ ఎమ్మెల్యే భరత్ భాల్కీకి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో అతన్ని పూణే నగరంలోని రూబీ ఆసుపత్రిలో చేర్చారు. భరత్ పరిస్థితి విషమించడంతో వెంటిలేటరుపై ఉంచారు. కానీ ఆరోగ్యం విషమించడంతో ఈరోజు కన్నుమూసారు. పాంథార్ పూర్ మంగల్ వేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భరత్ ప్రాతినిథ్యం వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm