హైదరాబాద్ : నివర్ తుఫాను ప్రభావం ఏపీపై ఎక్కువగానే చూపింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్.. ఈరోజు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరారు. హెలికాప్టర్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించనున్నారు. అనంతరం 11 గంటల 45 నిమిషాలకు తిరుపతిలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 12 గంటల 45 నిమిషాలకు తిరిగి గన్నవరం బయలుదేరి వెళ్తారు.
Mon Jan 19, 2015 06:51 pm