హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పాజిటివ్ కేసులు తగ్గినట్టే మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 41,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 485 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,51,110కి చేరింది. ఇందులో 87,59,969 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,54,940 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,36,200కి చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm