హైదరాబాద్ : శంషాబాద్ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్టు రాత్రి నుండి సోషల్ మీడియాల్ ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన ఆటవీ శాఖ ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం అని తెలిపింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఇందిరమ్మ కాలనీలో పులి కనిపించిందని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అక్కడికి వెళ్లి పరిసరాలను గమనించటంతో పాటు, స్థానికులతో మాట్లాడిన అటవీ శాఖ అధికారులు తప్పుడు సమాచారం అని తేల్చారు. శంషాబాద్ పరిసర ప్రాంతాలకు పులి వచ్చే అవకాశమే లేదని, అవాస్తవ ప్రచారాలతో స్థానికులు భయాందోళనలు చెందే అవకాశం ఉందని అటవీ శాఖ తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm