హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని.. ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మళ్లీ జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తథ్యమని.. సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందేందుకు డివిజన్కు కేసీఆర్ రూ.5కోట్లు పంపారని.. రూ.500 కోట్ల వరదసాయం టీఆర్ఎస్ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ తప్పకుండా చేస్తామని బండి సంజయ్ పునరుద్ఘాటించారు.
Mon Jan 19, 2015 06:51 pm