హైదరాబాద్ : భారత ఆటగాళ్లకు ఐసీసీ జరిమానా విధించింది. ఆసీస్ తో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేటు కారణంగా ఆటగాళ్లకు ఈ జరిమానా విధించింది. ఇన్నింగ్స్ ముగించడానికి భారత జట్టు నాలుగు గంటల ఆరు నిమిషాల సమయాన్ని తీసుకోవడంతో మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. కాగా నిన్న జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ పై ఆసీస్ ఘన విజయం సాధించింది.
Mon Jan 19, 2015 06:51 pm