హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బాలాజీనగర్ డివిజన్ లో రోడ్ షోకు టీఆర్ఎస్ శ్రేణులు ఎదురుగా వచ్చాయి. బీజేపీ నేతలు వెనక్కి వెళ్లిపోవాలని నినాదాలు చేశాయి. దీంతో, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం వేడెక్కింది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు.
Mon Jan 19, 2015 06:51 pm