హైదరాబాద్: ఎల్బీస్టేడియంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగింస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం సుదీర్ఘ పోరాటం చేశామని గుర్తుచేశారు. తెలంగాణ వాళ్లు రాష్ట్రాన్ని పరిపాలించలేరని అవహేళన చేశారని చెప్పారు. రాష్ట్రం అంధకారం అవుతుందని మాట్లాడారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో వరదల వచ్చాయని అయితే దేశంలో ఎవరు ఇవ్వని విధంగా వారికి 10వేలు ఇవ్వాలని అనుకున్నామని అనుకన్నట్టే కొంతమందికి ఇచ్చామని మరి కొందరికి మీ సేవా ద్వారా ఇవ్వాలని ఆదేశించా అని అన్నారు. అయితే కొంతమంది కిరికిరి పెట్టారు అని కేసీఆర్ అన్నారు. అయితేనేం డిసెంబర్ 7తరువాత అందరికి వరదసాయం అందిస్తామని కేసీఆర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm