హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగంపై యాంకర్ ఉదయ భాను మాట్లాడారు. ఓటు మన స్వేదం, మన రుధిరం, మన భారతావని భవితం అంటూ కొత్త భాష్యాన్ని చెప్పుకొచ్చారు. మాటల, అంకెల గారడీలో నాయకులు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వైనాన్ని కనిపెట్టాలని సూచించారు. ఓటును నిర్వీర్యం చేయొద్దు...ఓటు వేసి తీరదాం అంటూ ఉదయ భాను సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm