ఖమ్మం : ఆరుగాలం కాయకష్టం,సాగు పెట్టుబడి వడ్డీల అప్పులు,వరి పంట పండించి తీర ఫలం వన్ను అయ్యే సమయానికి నివర్ తుఫాన్ అనే విపత్తు వచ్చిపడటంతో రైతులు అతలాకుతలం అయ్యారు. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని కురుస్తున్న జల్లులతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.పంటకు వచ్చిన వరిని కోసి పనులుగా వేసిన రైతులు,నూర్చిన ధాన్యాన్ని కళ్లాలల్లో ఆరబోసిన రైతులు,ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరిలించి రాసులుగా నిల్వ చేసిన రైతులు వీరి పరిస్థితి కడుదయనీయం. నీట మునిగిన పనులు తిరిగేస్తూ,కళ్ళాలలో ఆరబోసిన ధాన్యాన్ని ఆరపెడుతూ,టార్పాలిన్లు కప్పినా కూడా వాటిపై నీరు నిలవడంతో రైతులు అనేక ఇక్కట్లకు గురి అయ్యారు. వర్షం శుక్రవారం కాస్తా విరామం ఇవ్వడంతో రైతులు నష్ట నివారణా చర్యలు చేపట్టారు. మండలంలో సుమారుగా 7 వేలు పై చిలుకు ఎకరాల్లో వరి సాగు చేసారు.5 వేలు ఎకరాలకు పైగా రైతులు వ్యవసొయ అధికారులను కోత అనుమతికి కూపన్లు తీసుకున్నారు.సుమారు 2 వేలు ఎకరాల లోపు వరి పంట కోతలు కోసారు.దాదాపు 1 వేయి ఎకరాల నూర్చిన ధాన్యాన్ని మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 11 కొనుగోలు కేంద్రాలకు వారం రోజుల క్రితం నుండి రైతులు ధాన్యాన్ని తరలిస్తున్నారు.కాని నేటి వరకు ఒక్క రైతు వద్దే కొనుగోలు చేసినట్లు అధికారులు చెపుతున్నారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాలంటే..
ముందుగా రైతు వ్యవసాయ క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా కోత అనుమతి కూపన్ పొందాలి.
ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి అక్కడనే తేమ శాతం తగ్గేవరకు ఆరబెట్టాలి.
తాలు తడక లేకుండా తూర్పార పట్టాలి.
నాన్యతా ప్రమాణ ధృవ ఎఫ్ ఎ క్యు(ఫర్ ఎస్యూర్డ్ క్వాలిటీ)పత్రం పొందాలి.
తూకం వేసి అప్పగించాలి.
ఇంతలో నివర్ వచ్చిపడింది.ధాన్యాన్ని టార్పాలిన్,బరకాలతో రక్షించుకున్నారు.అయినా వాన కారణంగా పాక్షికంగా దెబ్బతిన్నాయి.వాటిని రక్షించుకునే పనిలో రైతులు నిమగ్నం అయ్యారు.
కుర్సం జోగయ్య, తిరుములకుంట
అప్పు తెచ్చి వరి పంట సాగు చేశాను.వరి కోసి ధాన్యం అమ్మాలంటే తేమ శాతం తగ్గితేనే కొనుగోలు జరుపుతారనే నిబంధన వల్ల కళ్ళంలో ఆర పోశాను.తీరా ప్రకృతి నివర్ తుపాన్ పేరిట రైతులపై పగబట్టి కన్నెర్ర చేయడంతో వేలాది రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
కన్నయ్య,అచ్యుతాపురం.
గిట్టుబాటు ధర కోసం కేంద్రానికి తరలించా.విపత్తు వచ్చిపడింది.అయినా తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నా.ప్రభుత్వ హామీ ధరకే అమ్ముకుంటా.
సవరం సత్యనారాయణ,అచ్యుతాపురం.
నష్టానికైనా వ్యాపారికి అమ్ముకుని సొమ్ము చేసుకుందాము కున్నాం.ఇంతలోనే తుఫాన్ వచ్చిపడింది.తడవడంతో మొక్కలు వచ్చాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 28,2020 07:19PM