హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు క్రాస్రోడ్డు వద్ద శనివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. తిరుమలాయపాలెం మండలం పాతర్ల పాడు గ్రామానికి చెందిన బాబురావు (35) వ్యక్తిగత పనులపై ఉదయం బైక్పై మహబూబాబాద్ జిల్లా మరిపెడ వెళ్లాడు. సాయంత్రం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. సుబ్లేడ్ క్రాస్రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాబూరావు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm