హైదరాబాద్ : అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి దాడికి తెగబడ్డాడు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సీతారామయ్యతో పాటు.. అతని కుమార్తెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి ఎవరో ఇంటి తలుపు కొట్టగా.. సీతారామయ్య బయటికి వెళ్లి చూశాడు. ముఖానికి రంగు పూసుకుని వచ్చిన దుండగుడు.. అతనిపై దాడికి దిగాడు. అడ్డుకున్న అతని కుమార్తెనూ తీవ్రంగా గాయపరిచాడు. ఇద్దరూ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm