హైదరాబాద్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న బురేవి తుపాను శ్రీలంక తీరం దాటి తమిళనాడు తీరం దిశగా పయనిస్తోంది. ఈ అర్ధరాత్రి తర్వాత పంబన్, కన్యాకుమారి మధ్య బురేవి తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో 80 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. దీని ప్రభావం తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. తమిళనాడుతో పాటు కేరళలోని 7 జిల్లాలపై బురేవి ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ బులెటిన్ లో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm