హైదరాబాద్: హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతూ ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పట్టుబడ్డారు. గోవా, విశాఖపట్టణం ఏజేన్సీల నుంచి మాదక ద్రవ్యాలను తీసుకువచ్చి విక్రయిస్తూ హైదరాబాద్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్కు పట్టుబడ్డారు. మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన శివసేనారెడ్డి, వనస్థలిపురం కమలానగర్ వాసి మేక సాయి, ఘట్కేసర్ పోచారంలోని సింగపూర్ టౌన్షిప్ నివాసి హర్షవర్ధన్ ప్రముఖ సంస్థల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం తార్నాకలో వారిని అరెస్టు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm