హైదరాబాద్: నగరంలో రేపు జీహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది. దినికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రేటర్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రేపు ఉదయం 6గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6గంటల వరకు నిషేదాజ్ఞలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. రోడ్లపై ఎక్కువ మంది గుమిగూడడం, ఊరేగింపులను నిషేధించారు. ఎవరూ ఆయుధాలను కలిగి ఉండరాదు. చేతిలో కర్రలు, లాఠీలు, పేలుడు పదార్ధాలు, ఇతర ఆయుధాలు కలిగి ఉండరాదు. అలాగే ఊరేగింపులు, గుంపులు గుంపులుగా పోగవడం, సమావేశాలు నిర్వహించడం వంటివి కూడా నిషేధించారు. తాత్కాలికంగా ఎక్కడా టెండ్లు వేయడం, స్టేజీలను ఏర్పాటు చేయరాదు. మైకులు ఏర్పాటుచేయడం, పబ్లిక్ లౌడ్ స్పీకర్లను ఉపయోగించరాదు. ప్లకార్డుల ప్రదర్శనలు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వంటివి చేయరాదని పోలీస్కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm