హైదరాబాద్ : కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు రైతులుకు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రొఫెషనల్ రెజ్లర్ దలీప్ సింగ్ రానా అకా ది గ్రేట్ ఖలీ రైతులకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. అలానే దేశవ్యాప్తంగా ప్రజలను రైతులకు మద్దతివ్వాల్సిందిగా అభ్యర్థించారు. కేంద్రం రైతుల డిమాండ్లను ఒప్పుకోవాలంటే మనమంతా వారికి మద్దతివ్వాలి అని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm