హైదరాబాద్ : ఎన్నికల్లో గెలిచిన తన భర్తను భుజాలపైకి ఎత్తుకుని ర్యాలీ తీసింది ఓ మహిళ. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జరిగింది. పుణె జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సోమవారం ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఖేడ్ తాలుకాలోని పలు అనే గ్రామ సర్పంచ్గా సంతోష్ గౌరవ్ అనే వ్యక్తి గెలిచాడు. భర్త గెలిచిన ఆనందంలో అతడిని తన భుజాలపైకి ఎత్తుకుని ఊరంతా తిరిగుతూ సంబరాలు చేసుకుంది ఆయన భార్య రేణుక సంతోష్ గౌరవ్. ఇకపోతే కోవిడ్ కారణంగా ఎన్నికల అనంతరం గెలిచిన అభ్యర్థులు ర్యాలీ తీయడంపై జిల్లా కలెక్టర్ కొన్ని నిషేధాలు విధించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది కనిపించకూడదని, భౌతికదూరం తప్పని సరి అని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా కేవలం ఐదుగురు వ్యక్తులతో, భౌతిక దూరాన్ని పాటిస్తూ తన భర్త విజయోత్సవ ర్యాలీని రేణుక సంతోష్ గౌరవ్ నిర్వహించింది.
Mon Jan 19, 2015 06:51 pm