హైదరాబాద్ : జనవరి 16 వ తేదీ నుంచి దేశంలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. ముందుగా ఆరోగ్యసిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సిన్ బులెటిన్ ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం, తెలంగాణలోని 894 సెంటర్లలో వ్యాక్సిన్ ను అందించారు. 73,673 మందికి వ్యాక్సిన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 51,997 మందికి మాత్రమే వ్యాక్సిన్ ను అందించారు. ఈరోజు 71శాతం మందికి వ్యాక్సిన్ అందించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇక రాష్ట్రంలో ఈరోజు వ్యాక్సిన్ తీసుకున్న 51,997 మందిలో 51 మంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న ముగ్గురి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యాధికారులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 19,2021 09:32PM