హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లో ఘటన జల్పాయిగుడి జిల్లా ధుప్గుడి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. బండరాళ్ల లోడ్తో వెళ్తున్న ట్రక్కు ఓ కారుతో పాటు ఆటోపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక ఎమ్మెల్యే మిథాలీ రాయ్ తెలిపారు. గాయపడ్డిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను జల్పాయిగుడిలోని హాస్పిటల్కు తరలించారు. అయితే ఓవర్లోడ్, పొగమంచు కారణంగా ట్రక్కు అదుపు తప్పి పక్కనే వెళ్తున్న వాహనాలపై బోల్తాపడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బండరాళ్లు వాహనాలపై పడడంతో భారీగా దెబ్బతిన్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm