న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం పదో రౌండ్ చర్చలు జరుపనుంది. సమావేశం మంగళవారం జరుగాల్సి ఉండగా.. బుధవారానికి వాయిదా వేసినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపింది. మధ్యాహ్నం 2గంటలకు ఢిల్లీ విజ్ఞాన్ భవనంలో చర్చలు జరుగనున్నాయి. ఈ మేరకు 40 రైతు సంఘాల నేతలకు వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ లేఖ రాశారు. ఇంతకు ముందు ఈ నెల 15న జరగ్గా.. ఎటూ తేలకుండానే ముగిశాయి. ఇరుపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన చర్చలూ కొలిక్కి రావడం లేదు.
Mon Jan 19, 2015 06:51 pm