న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 29న ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 30న అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నేతృత్వం వహించనున్నారు. అయితే ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనుంది. కాగా, అదేరోజున బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలు కూడా సమావేశం కానున్నాయి. కరోనా నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈసారి రెండు విడుతలుగా జరుగుతాయి. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29న ప్రారంభమై ఏప్రిల్ 8న ముగుస్తాయి. తొలివిడుత జనవరి 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు, రెండో విడుత మార్చి 8 నుంచి ఏప్రిల్ 8వరకు జరుగనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm