హైదరాబాద్ : ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టీడీపీ నేత అంకుల్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ సర్పంచ్ హత్యలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. జనవరి 3 న మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకుల్ హత్య జరిగిందని మాజీ సర్పంచ్ హత్య కేసులో కర్పూరపు వెంకట కోటయ్య, గుర్రం వెంకటేశ్వర రెడ్డి, చిన్న శంకర్ రావు, మేకల చిన కోటేశ్వరరావు, పొట్టిసిరి అంకారావు, అద్దంకి రమేష్ లు అరెస్టయ్యరని ఆయన పేర్కొన్నారు. హత్య సమయంలో నలుగురు ఉన్నారని, ఫుడ్ లో మత్తు మందు కలిపి అనంతరం హత్య చేశారని అయన అన్నారు. ముగ్గురు వ్యక్తులకు మృతుడితో ఉన్న విభేదాల వల్లే అంకులు హత్య జరిగిందన్న ఆయన నిందితులు మృతుడికి తెలిసిన వారేనని గతంలో వీరు కలిసి పని చేశారని అన్నారు. కోటేశ్వరరావు అనే నిందితుడికి అంకుల్ కు మధ్య వివిధ కారణాలతో విభేదాలు వచ్చాయని, మరో నిందితుడు వెంకట కోటయ్య కు అంకుల్ కి మధ్య కొంత కాలం గా గొడవలు ఉన్నాయని అన్నారు. వెంకట కోటయ్య జనశక్తి అనే గ్రూప్ లో గతం లో పని చేశారని భూములు, ఇతర వ్యక్తిగత కారణాలు హత్యకు కారణమని ఎస్పీ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm