హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. జిల్లాలోని బాల్కొండ మండలం శ్రీరాంపూర్-చిట్టాపూర్ వద్ద జాతీయ రహదారి 44 పై బాల్కొండ నుంచి ద్విచక్రవాహనంపై నిర్మల్కు వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న భారీ కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో నిర్మల్ జిల్లాకు చెందిన కల్పన అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm