హైదరాబాద్: కేకే కూతురు, బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. షేక్పేట ఎమ్మార్వో కార్యాలయంలో ఆమె రెచ్చిపోయారు. తాను కేకే కూతుర్నంటూ ఎమ్మార్వో శ్రీనివాస్రెడ్డిపై విజయలక్ష్మి దాడి చేశారు. దీంతో పోలీసులకు ఎమ్మార్వో శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు చేశారు. హైకోర్టుకు వెళ్లాల్సి ఉండగా తనను అడ్డుకుని విజయలక్ష్మి దుర్భాషలాడిందని తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయలక్ష్మి అనుచరులు కూడా తనను నిర్బంధించారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm