హైదరాబాద్ : పూణే సీరం ఇన్స్టిట్యూట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పూణేలోని మంజ్రీ ప్లాంట్లో కొత్తగా నిర్మిస్తున్న భవనంలో మంటలను పూర్తిగా అదుపు చేసినట్లు పూణే మేయర్ మురళిధర్ మొహల్ తెలిపారు. అనంతరం లోపల పరిశీలించగా ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు. చనిపోయిన వారు భవన నిర్మాణ కార్మికులుగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదని, వెల్డింగ్ పనుల వల్ల మంటలు వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నట్లు పూణే మేయర్ మురళిధర్ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm