నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని మాలపల్లి ప్రాంతంలో బల్ధియా( మున్సిపల్ కార్పొరేషన్ ) కు సంబంధించిన చేత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించే ట్రాక్టర్ డికోని బాలుడు ధుర్మరణం చెందాడు. ఈ సంఘటనలో పాలకోసం గురువారం ఉదయం సైకిల్ పై బయటకు వచ్చిన అబు బాకర్ ( 12) మృతి చెందాడు. ట్రాక్టర్ ను అనుభవంలెని యువకుడు నిర్లక్ష్యంగా నడుపడంతో ఆరవ తరగతి చదివే అబు బాకర్ ను డికోట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందడంతో స్థానికులు ట్రాక్టర్ డ్రైవర్ ను చితక బాది పోలిస్ లకు అప్పగించారు. మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన ట్రాక్టర్ డికోని బాలుడు మృతి చెందడంతో పెద్ధ ఎత్తున ప్రజలు గుమి గుడటంతో ఉధ్రిక్తత పరిస్థుతులు ఎర్పడ్డాయి.ఈ విషయంలో స్థానిక మజ్లీస్ పార్టికి చెందిన కార్పొరేటర్లు మున్సిపల్ కాంట్రాక్టర్ ను పిలిపించి మాట్లాడి సయోద్య చేయ్యడంతో గోడవ పెద్ధది కాలేదని తెలిసింది. మున్సిపల్ అధికారులు మాత్రం చేత సేకరణ ప్రైవేట్ వ్య్తకులకు కాంట్రాంక్ట్ ఇచ్చామని ఈ విషయంలో బల్ధియా చేసేదేమి లేదని తెలిపినట్లు తెలిసింది. ఈ మేరకు స్థానిక పోలిస్ లు కేసు నమోదు చేసి ట్రాక్టర్ ను సీజ్ చేసి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 21,2021 08:39PM