హైదరాబాద్ : ఇంగ్లాండ్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. భారత్ తో ఇంగ్లాండ్ 4 టెస్టులు ఆడుతుంది. ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా జరిగే తొలి రెండు టెస్టుల కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. తన ఎక్స్ ప్రెస్ వేగంతో బ్యాట్స్ మెన్ ను హడలెత్తించే జోఫ్రా ఆర్చర్ జట్టులోకి పునరాగమనం చేశాడు.
అలాగే, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, ఓపెనర్ రోరీ బర్న్ కూడా జట్టులోకి వచ్చారు. ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు ఇదే...
జో రూట్ (కెప్టెన్), రోరీ బర్న్స్, డామ్ సిబ్లే, జాక్ క్రాలే, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, ఓల్లీ స్టోన్, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, స్టూవర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, డామ్ బెస్, క్రిస్ వోక్స్, జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 21,2021 08:56PM