హైదరాబాద్ : పూణే సీరం ఇన్స్టిట్యూట్లో మరోసారి మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మహారాష్ట్ర పూణేలోని మంజ్రీ ప్లాంట్లో కొత్తగా నిర్మిస్తున్న భవనంలో గురువారం మధ్యాహ్నం మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. అయితే మళ్లీ సాయంత్రం ఏడు గంటల సమయంలో అదే భవనంలో మరోసారి మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అగ్నిమాపక వాహనాలతో అదుపు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm