అమరావతి: ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. జనవరి 25 నుండి 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు గడువు విధించారు. జనవరి 28 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లు జరుగనున్నాయి. జనవరి 31 సాయంత్రం 6 తర్వాత వెబ్ ఆప్షన్లు మార్చేందుకు వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఫిబ్రవరి 2, సాయంత్రం 6 తర్వాత సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నారు. జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.1200, ఎస్సీ, ఎస్టీలకు రూ.600ల చెప్పున ఫీజును విధించారు. అభ్యర్థుల కోసం 8106876345, 8106575234, 7995865456, 7996681678నెంబర్లను అధికారులు ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm