హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో విగ్రహాల ధ్వంసం చర్చనీయాంశమైంది. తాజాగా హైదరాబాద్లో విగ్రహాల ధ్వంసం కలకలం రేపుతోంది. కూకట్పల్లి మూసాపేట్ సర్దార్నగర్లోని దుర్గామాత ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. ధ్వంసం చేసి ఓ విగ్రహాన్ని పూర్తిగా తొలగించారు. ఇక, అక్కడే ఉన్న జంట నాగుల విగ్రహాన్ని సైతం ముక్కలు చేశారు. అంతేకాకుండా.. ఆలయం ఆవరణలో ఓ కుక్కను కూడా వేలాడదీసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలానికి వెళ్లిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఆలయంలో తిరిగి విగ్రహాలను ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి చేసేందుకు గాను తాను రూ.5 లక్షల రూపాయల విరాళం ఇవ్వనున్నానని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm