అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణను నేడు సుప్రీంకోర్టు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది శివప్రసాద్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2019 ఓటరు జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో యువత ఓటు హక్కు కోల్పోతుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో న్యాయవాది వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఎల్లుండి విచారణ చేపడతామని పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm