హైదరాబాద్ : లంచం తీసుకున్న కేసులో జైలుశిక్ష పడిన ఓ ఇన్కం ట్యాక్స్ ఆఫిసర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా కరోనా పరీక్షలు చేయించుకోగా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్లోని రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో చోటుచేసుకున్నది. కోటా జిల్లాకు చెందిన వినయ్కుమార్ మంగ్లా (45) ఇన్కం ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేసేవాడు. అయితే 2016 డిసెంబర్లో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులు ముందే అమర్చిన సీసీ కెమెరాకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. ఈ కేసులో ఆరెస్టయ్యి అనంతరం బెయిల్పై జైలు నుంచి బయటికి వచ్చిన మంగ్లా నాలుగేండ్లుగా విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో గత శుక్రవారం జైపూర్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారిస్తూ ఐదేండ్ల జైలుశిక్ష విధించింది. మంగ్లాను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చింది. దాంతో అతడిని చికిత్స నిమిత్తం రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో చేర్చారు. మూడు రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్న మంగ్లా సోమవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm