హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేతల నుండి షాకులు తగులుతున్నాయి. తాజాగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మంత్రి.. ఏ నమశివాయం, ఆయన అనుచరుడైన ఎమ్మెల్యే తీపింతన్ తమ పదవులకు రాజీనామా చేశారు. శాసనసభ స్పీకర్ వీపీ శివకోజుండును సోమవారం కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. మంత్రి నమశివాయం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నరన్న ఆరోపణలపై పుదుచ్చేరి పీసీసీ అధ్యక్షుడు ఏవీ సుబ్రమణియన్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో నమశివాయం తన అనుచరుడైన ఎమ్మెల్యే తీపింతన్తో కలిసి స్పీకర్ను కలిశారు. మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనుచరుడు తీపింతన్ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను స్పీకర్కు అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm