హైదరాబాద్: కొడంగల్ను దత్తత తీసుకున్న కేటీఆర్ అభివృద్ధి చేసినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని, తాను చేసిన అభివృద్ధికి రంగులు మార్చి వారి ఖాతాలో వేసుకుంటున్నారని కాంగ్రేస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ పచ్చి అబద్దాలతో బ్రతికేస్తున్నారని, అబద్దాలు చెప్పడమే సీఎం పదవికి అర్హత అనుకుంటున్నారని విమర్శించారు. 2019 తర్వాత కొడంగల్కు ఒక్క అభివృద్ధి పనిని మంజూరు చేయలేదని, కేటీఆర్కు దమ్ముంటే పనులు మంజూరు చేసినట్టు పోలేపల్లి ఎల్లమ్మ మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ చేశారు. అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కేటీఆర్ గుంటకాడి నక్కలా సీఎం పదవి కోసం ఎదురు చూడాల్సిందేనని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ కేటీఆర్ను సీఎం చేయరని అన్నారు. మంత్రి పదవి పోతుందని భయపడేవారు, కొత్తగా మంత్రి కోరుకుంటున్న వారే కేటీఆర్ సీఎం అని అంటున్నారని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm