హైదరాబాద్ : కొన్ని వారాలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో నిరసనలు తెలుపుతున్న రైతులు రేపు రిపబ్లిక్ డే సందర్భంగా భారీ ఎత్తున ట్రాక్టర్ల పరేడ్ కు సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ పరేడ్ లో పాల్గొనేందుకు పంజాబ్ కు చెందిన ఓ రైతు వినూత్నరీతిలో ఢిల్లీ చేరుకున్నాడు. గురుచరణ్ సింగ్ అనే ఈ రైతు పంజాబ్ లోని బర్నాలా నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వరకు ట్రాక్టర్ ను రివర్స్ గేర్ లో నడుపుకుంటూ వచ్చాడు. తాను రివర్స్ గేర్ లో రావడానికి గల కారణం వివరిస్తూ.... కేంద్రం కూడా నూతన వ్యవసాయ చట్టాలను రివర్స్ చేయాలని కోరుతూ ఈ విధంగా వచ్చానని వివరించాడు. అయితే, రోడ్డుపై ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగించని రీతిలో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేశానని గురుచరణ్ సింగ్ తెలిపాడు. రివర్స్ గేర్ లో వచ్చేటప్పుడు అదేపనిగా వెనక్కి తిరిగి చూడాల్సి వచ్చిందని, దాంతో తన మెడ, కాళ్లు బాగా బాధించాయని వెల్లడించాడు. రైతు ట్రాక్టర్ లో రివర్స్ గేర్ లో వచ్చిన వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.
Mon Jan 19, 2015 06:51 pm