హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో గతేడాది ఆలస్యంగా బిగ్బాస్ ప్రారంభం అయినప్పటికీ.. షో మాత్రం ఫుల్ సక్సెస్ అయ్యింది. కాగా బిగ్ బాస్-4.. ముగిసి నెల రోజులు గడిచింది. ఈ క్రమంలో ఇప్పుడు ఐదో సీజన్ కోసం అప్పుడే నిర్వాహకులు పనులు స్టార్ చేసినట్లు తెలుస్తోంది. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం మరో రెండు నెలలో బిగ్బాస్-5ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఏప్రిల్ చివర్లో ఈ సీజన్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సీజన్కి కూడా నాగార్జున వ్యాఖ్యతగా ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే హౌజ్ నుంచి బయటకు వచ్చిన వారిని సొహైల్ ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు టాక్.
ఇక ఈ షోకు సంబంధించి మరోవైపు కంటెస్టెంట్లను ఫైనల్ చేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈసారి బాగా పాపులారిటీ తెచ్చుకున్న వారిని చూడాలని నాగార్జున ఇప్పటికే నిర్వాహకులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నిర్వాహకులు కూడా ఈ సారి పేరు మోసిన వారిని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో ఇప్పటికే యాంకర్ రవి, కమెడియన్ హైపర్ ఆది పేర్లను నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే గత సీజన్లో సినీ నటులు తక్కువగా ఉండగా.. వారిని కూడా ఈ సీజన్లో ఎక్కువగా తేబోతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం కొద్ది రోజులు ఆగాల్సిందే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 25,2021 05:43PM