హైదరాబాద్ : దేశంలో పలు పాత కరెన్సీ నోట్లు రద్దు చేస్తారంటూ వస్తోన్న వార్తలపై రిజర్వు బ్యాంకు స్పందించింది. అలాంటి వార్తలను కొట్టిపారేస్తూ ట్వీట్ చేసింది. దేశంలో రూ.100, రూ.10, రూ.5 సిరీస్ కరెన్సీ నోట్లు చలామణిలోనే ఉంటాయని స్పష్టంచేసింది.2016 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 పాత నోట్లు రద్దు చేసినప్పటికీ.. రూ. రూ.5, రూ.10, రూ.100లను మాత్రం కొనసాగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చలామణిలో ఈ పాత నోట్ల విషయంలో మార్చి నెలలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను మార్చడమో, లేదంటే వాటిని పూర్తిగా ఉపసంహరించుకోవడమో జరుగుతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు అన్ని అవాస్తవమని ఆర్బీఐ ట్విటర్లో ద్వారా తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm